తమిళ సినీనటుడు డిఎంకె నాయకుడు ఉదయనిధి స్టాలిన్ జన్మదినోత్సవ సందర్భంగా నగరిలో డిఎంకె పార్టీ నాయకులు ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
తమిళనాడు తిరుత్తణి నియోజకవర్గం ఎమ్మెల్యే చంద్రం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
నగరి టవర్ క్లాక్ వద్ద పార్టీ జెండా ఆవిష్కరించి అన్నదానం చేశారు. మానసిక వికలాంగుల పాఠశాలలో విద్యార్థులకు భోజన వసతి కల్పించి సహపంక్తి భోజనం కల్పించారు.
ఈ కార్యక్రమంలో డీఎంకే రాష్ట్ర ఆర్గనైజర్ మూర్తి ఇ నాయకులు మైకేల్ రాజు రజినీకాంత్ బషీర్ నందగోపాల్ శెట్టి షణ్ముగం తదితరులు పాల్గొన్నారు.
తమిళ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నగరిలో డిఎంకె పార్టీఅస్తిత్వం కూడా బాగానే ఉంటుంది. అందుకే పార్టీ నాయకులు ఉదయనిధి పుట్టినరోజు సెలబ్రేట్ చేశారు.
.