సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని స్థానిక కల్లివెట్టు ఉన్నత పాఠశాలలో శుక్రవారం భారత దేశ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్ర పటానికి పుష్పాలంకరణ చేశారు.
అనంతరం జరిగిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు రమణయ్య విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ..
అంబేద్కర్ రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టిందని, సుదీర్ఘకాలం పరాయి పాలనలో మగ్గిన మనం భారతదేశం ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగ ఫలితాలతో 1947 ఆగస్టు 15న స్వతంత్ర భారత్గా అవతరించిందని తెలియజేశారు.
ఆ తర్వాత ప్రతి స్వతంత్ర దేశానికి ఒక రాజ్యాంగం వుండాలని బాబురాజేంద్రప్రసాద్ అధ్యక్షతన డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ భారత దేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించడంతో భారత రాజ్యాంగ సభ ఈ రాజ్యాంగాన్ని 1949 నవంబరు-26న ఆమోదించిన రోజునే భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు.
అనంతరం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు నాదెండ్ల మురళి, రామక్క ఆధ్వర్యంలో విద్యార్థులు చేత 48 సాంఘిక శాస్త్ర ప్రయోగాలు చేయించి ప్రదర్శన విద్యార్థులను ఆకట్టుకున్నది.
ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, క్విజ్, వక్తృత్వ, చిత్రలేఖనం, మరియు ప్రయోగాలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యువశ్రీ మురళి, సురేష్ బాబు, వేణుగోపాల్, ఒబ్బు దేవీ ప్రసాద్, మోహన్ బాబు, వాణి, దేవేంద్ర , మాధవీలత, దాసు తదితరులు పాల్గొన్నారు.
.