అన్నదాన కార్యక్రమం
వన్నెకుల క్షత్రియ సీనియర్ నాయకులు వడ్లతాంగల్ చంగల్ రాయల్ రెడ్డి రెండో వర్ధంతి సందర్భంగా స్థానిక వైఎస్సార్ విగ్రహం వద్ద ఆయన అభిమానులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంజూరు తారక శ్రీనివాసులు పాల్గొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ మామ చందమామ చెంగలరాయల్ రెడ్డి మామ అని, మా కుటుంబ సభ్యులతో సుమారు 20 సంవత్సరాలు అనుబంధం ఉందన్నారు.
ప్రతి ఒక్కరితో నవ్వుతూ పలకరించే మంచి వ్యక్తి అని కొనియాడారు.
ఈ అన్నదాన కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ సంక్షేమ సంఘం అధ్యక్షులు కృష్ణారెడ్డి (కిట్టు మేస్త్రి) మల్లెంబాకం ముని కృష్ణారెడ్డి, దొరబాబు, బండారుపల్లి ముని కృష్ణారెడ్డి, శీను, టైలర్ భాష తదితరులు పాల్గొన్నారు
.