ప్రభుత్వంపై భారం పెరిగితే ఏమవుతుంది? ఆ భారాన్ని ప్రభుత్వం ఎలా భరిస్తుంది? తిరిగి దానిని ప్రజల మీదికే ట్రాన్స్ఫర్ చేస్తుంది. విద్యుత్తు చార్జీల పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది అదే. ప్రభుత్వం చెబుతున్న వివరణ కూడా అదే. విద్యుత్తు కొనుగోలు భారం పెరిగినప్పుడెల్లా.. సర్దుబాటు చార్జీల పేరుతో నడ్డివిరుగుతోంది. అయితే ఇలాంటి భారం ప్రజల మీద ముందుముందు మరింతగా పడకుండా ఉండాలంటే.. ఇంధనశాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ ఓ మంచి సూచన చేస్తున్నారు.
పొదుపు అంటే కేవలం లభించిన దానిని ఆదా చేయడం మాత్రమే కాదు. ఖర్చును కూడా తగ్గించుకుంటూ తద్వారా.. భారం పెరగకుండా జాగ్రత్త పడడం కూడా. రాష్ట్ర ప్రజలందరి సమష్టి ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని, సామాన్య, మధ్యతరగతి వర్గాలు కుదేలైపోకుండా ఉండాలనే ఉద్దేశంతో.. నాగులపల్లి శ్రీకాంత్.. సంపన్న వర్గాల కోసం నాలుగు గంటల పొదుపు గురించి ఒక విజ్ఞప్తి చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ కూడా సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటలవరకు ఏసీలు ఆపేయాలని నాగులపల్లి శ్రీకాంత్ కోరుతున్నారు. విద్యుత్తు వాడకం పరంగా రద్దీ సమయం అది. రద్దీ సమయంలో అధిక విద్యుత్తు వాడకం వలన.. అనివార్యంగా అవసరం పెరుగుతుంది. ఉత్పత్తి అయ్యే విద్యుత్తు సరిపోదు. బహిరంగా మార్కెట్లో విద్యుత్తు కొనాల్సి వస్తుంది. అలా కొనే విద్యుత్తు బహిరంగ మార్కెట్ ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉందని శ్రీకాంత్ అంటున్నారు.
ఇవి కూడా చదవండి :
Movie Review : తప్పక చూడదగిన చిత్రం క్రిష్-వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’
జనంమెచ్చిన సీఎం.. ఆడు మగాడ్రా బుజ్జీ
పవర్ స్టార్ పవన్ = గ్యాంగ్స్టర్ నయీమ్.. ఎలాగో తెలుసా?
అభిమానులు ఊహించని స్టెప్ వేసిన జనసేనాని
ఆయన చెబుతున్న ప్రకారం.. సెప్టెంబరు 16నాటి ధర యూనిట్ కు 4.60 కాగా, అక్టోబరు 6వతేదీ నాటికి అది రూ.14గా మారిందని అంటున్నారు.
దీనివల్లనే సర్దుబాటు చార్జీల భారం పడుతోందనేది శ్రీకాంత్ చెబుతున్న మాట. అందుకే ఆయన ఈ పరిష్కారం చెబుతున్నారు. రాష్ట్రంలో అందరూ కూడా.. ఆ సమయంలో ఏసీలు ఆపేయాలని ఆయన కోరుతున్నారు. దీనివల్ల రద్దీ సమయంలో విద్యుత్తు డిమాండ్ పెరగదని, ఓపెన్ మార్కెట్లో కొనాల్సిన అవసరం గానీ.. కొన్నిచోట్ల పవర్ కట్లు ఏర్పడే ఇబ్బందిగానీ ఉండదనేది ఆయన వివరణ.
ఇలా ఏసీలు ఆపేయడం వలన.. రోజుకు కోటి యూనిట్ల విద్యుత్తు పొదుపు అవుతుందని శ్రీకాంత్ అంటున్నారు. ఆయన చెప్పిన ప్రకారం.. యూనిట్ ధర రూ.14 అనుకుంటే.. రోజుకు 14 కోట్ల భారం తగ్గుతుంది. అంటే నెలకు కనీసం 420 కోట్ల భారం తగ్గుతుంది.
ధనవంతులారా ఆపేయండి..
ఏసీలు అనేవి సామాన్యుడి వ్యవహారం కాదు. మధ్యతరగతి వ్యవహారం కూడా కాదు. ఎగువ మధ్య తరగతిలో పరిమితంగా, సంపన్నుల్లో విరివిగా ఏసీలు వాడుతారు. కానీ సర్దుబాటు చార్జీల పేరిట భారం పడితే.. ఆ భారం సామాన్యులు, మధ్యతరగతి వారు అందరికీ పడుతుంది. అందుకే, ఈ ఏసీలు వాడే సంపన్న వర్గాల వారు రాష్ట్ర సమష్టి ప్రయోజనాల కోసం నాగులపల్లి శ్రీకాంత్ చెబుతున్న పొదుపు మంత్రాన్ని పఠిస్తే బాగుంటుంది.
ఇవి కూడా చదవండి :
హవ్వ.. రాజగురువు చెప్పినట్టే టీటీడీ ఆడుతోందా?
ప్రజల్లో లోపమే.. ఇష్టారీతిగా ధరల పెంపుదలకు కారణమా?
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?
మధ్యతరగతి వారు కుదురుగా బతకడానికి.. సంపన్న వర్గాల వారు పొదుపు ఉపయోగపడుతుంది. సర్దుబాటు చార్జీల భారం కొత్తగా పడకుండానూ ఉంటుంది. ప్రభుత్వం మరింత అప్రతిష్ట మూటగట్టుకోకుండానూ ఉంటుంది.
.