శ్రీకాళహస్తీశ్వరస్వామివారి దేవస్థానంలో తేది.23.11.2021 నుండి తేది.02.12.2021 వరకు శ్రీస్వామి అమ్మవార్లకు లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చన జరిగినది.
శుక్రవారం ఉదయం 9గంటలకు శ్రీస్వామి వారి ఆలయం ముందు అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా 108 కలశాలను ఉంచి పూజచేసి హోమము నిర్వహించారు. మహాపూర్ణాహుతి సమర్పించి ధూప దీప నైవేద్యములు హారతి సమర్పించారు.
ఆ ప్రధాన కలశాలను ప్రదక్షిణముగా తీసుకువచ్చి శ్రీస్వామి అమ్మవార్లకు కలశజలాలతో అభిషేకించి అటుపిమ్మట శ్రీస్వామి అమ్మవార్ల గర్భాలయం ముందు తిరుప్పావడ (కుంభం) వేసి స్వామి అమ్మవార్లకు ధూప దీప నైవేద్యం హారతులు మంత్రపుష్పం నిర్వహించడం జరిగినది.
తరువాత శ్రీస్వామి అమ్మవార్లకి జరిగిన లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చన నిర్మాల్యమును మేళతాళములతో తీసుకువెళ్లి స్వర్ణముఖి నదిలో నిమజ్జనచేయ బడినది.
covid-19 నిబంధనలకు లోబడి సాయంత్రం ప్రదోషకాల 7 00 గంటలకు లోపల ప్రకారము నందు ఉత్సవం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఈవో పెద్ది రాజు గారు దంపతులు, డిప్యూటీ ఈవో కృష్ణా రెడ్డి, ఏ ఈ ఓ ధనపాల్, పర్యవేక్షకులు విజయ సారథి, నాగభూషణం, అనువంశిక ప్రధాన అర్చకులు, అర్చకులు, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు.
.