తెలుగుగంగ కాలువలో పడి ఓ వలంటీరు గల్లంతైన సంఘటన సోమవారం జరిగింది.
ఇందుకు సంబంధించి వివరాలు పరిశీలిస్తే..
చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం ఇలగనూరు పంచాయతీ పరిధిలో గ్రామ వలంటీరుగా పని చేస్తున్న మునిరాజ (26) (పి.చంద్రయ్య కుమారుడు ) అనే యువకుడు కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం తమ గ్రామ సమీపంలోని తెలుగుగంగ కాలువ వద్దకు వెళ్లాడు.
ఈ సందర్భంగా అతడు ప్రమాదశశాత్తు కాలువ నీటిలో పడిపోయాడు. ప్రవాహ ఉధృతికి అతడు కొట్టుకు పోయాడు.
అతని ఆచూకీ కోసం అధికార యంత్రాంగం గాలిస్తోంది.
మునిరాజ ‘గంగ’ కాలువలో గల్లంతు కావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు రోదిస్తున్నారు. ఈ ఘటన ఇనగలూరులో విషాదం నింపింది.
.