ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ.. అంతో ఇంతో వైఎస్సార్ కాంగ్రెస్ నేతృత్వంలోని జగన్ ప్రభుత్వానికి అండాదండగా ఉంటున్నదనే గుసగుసలు ఎప్పటినుంచో వినిపిస్తూనే ఉన్నాయి. జగన్ కేంద్రంలోని తమ జట్టుతోనూ సఖ్యత పాటిస్తున్నాడనే ముసుగు వేసుకుని, రాష్ట్ర బీజేపీ నాయకులు జగన్ పంచన చేరి, తమ స్వకార్యాలు చక్కబెట్టుకోవడం జరుగుతూనే ఉంది.
అయితే కమలదళం పరువు పోయేలాగా, బీజేపీ బలహీన పడేలాగా వారు వ్యవహరిస్తున్నారా? వైసీపీతో చెట్టపట్టాలు బీజేపీకి పుట్టి ముంచుతున్నాయా? ఆ సంగతి అధినాయకులు గుర్తించారా? అంటే మాత్రం అవుననే చెప్పాలి. అందుకే రాష్ట్ర నాయకుల మీద, రాష్ట్ర పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వారిమీద కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు.
ఈ వ్యవహారం తిరుపతిలో రాష్ట్ర నాయకులతో సమావేశం అయిన సందర్భంలో జరిగింది. ఆ సందర్భంలో అమరావతి రైతులకు సంబంధించి.. వారిని టీడీపీ పార్టీ కార్యకర్తలుగా, కాంట్రాక్టు కూలీలుగా అభివర్ణించినందుకు సోము వీర్రాజు మీద ఆగ్రహించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆయన ఫైర్ కావడం ఇంకా సుదీర్ఘంగానే సాగింది.
ఇతర అంశాలపై అమిత్ షా ప్రస్తావిస్తూ.. మేధావిగా పేరు గడించి, విడమరచి మాట్లాడుతూ బీజేపీ నిర్ణయాలను, జగన్ నిర్ణయాలను సమర్థిస్తూ ఉండే.. ఒక కీలక నాయకుడు మాట్లాడుతున్న సమయంలో అమిత్ షా జోక్యం చేసుకుని.. ‘‘మన పార్టీలో వైసీపీ ఏజంట్లున్నారు. నాకు తెలియదనుకుంటున్నారు.. అందరి కతల గురించీ నా దగ్గర సమాచారం ఉంది’’ (సభీ కా మామలా జాన్కారీ హై మేరే పాస్) అని ఆగ్రహించినట్టు సమాచారం.
అమిత్ షా ఉగ్రుడై ఈ రేంజిలో అనడంతో.. సదరు మేధావి నాయకుడు కంగారు పడి నీళ్లు నమిలినట్టు సమాచారం. రాష్ట్ర పార్టీ వైసీపీ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నట్టు అమిత్ షా వద్ద సమాచారం ఉంటే ఉండొచ్చు గానీ.. ఇన్నాళ్లుగా ఏం చేస్తున్నారు? ఎందుకు పార్టీని పరిశుద్ధం చేయకుండా ఉపేక్షిస్తున్నారు?
బీజేపీ నాయకులు మాత్రం.. దేనికైనా టైం రావాలని.. టైం వచ్చినప్పుడు.. ఈ వైసీపీ ఏజంట్లు సమూలంగా ప్రక్షాళన అయిపోతారని అంటున్నారు.
Also Read : అధికార విపక్షాల మధ్య స్నేహబంధాలు విరియవా?
మంచితనం నిరూపించుకున్న వైసీపీ ఎమ్మెల్యే భూమన
ఈ రాశుల్లో పుడితే.. ప్రేమను బయటకు చెప్పలేరుట!
చంద్రబాబు కన్నీళ్లు ఆయనకు మేలు చేస్తున్నాయా? నిజమేనా?
మగాళ్ల దినోత్సవం రోజున మోడీ వెనక్కి తగ్గితే, చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చాడు
.