సమస్యల సాధన కోసం ఉద్యమాలు తప్పవు అని ప్రభుత్వ పధకాలను ప్రజలకు చేరవేసే ఉద్యోగులకు ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో జాప్యం చేయడం తగదని శ్రీకాళహస్తి జె ఏ సి తాలూకా చైర్మన్ సి . చెంచురత్నం యాదవ్ అన్నారు.
రాష్ట్ర జె ఏ సి నాయకుల పిలుపు మేరకు గురువారం శ్రీకాళహస్తి పట్టణంలోని ఏపీ ఎన్ జి ఓ పక్కనే ఉన్న తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్యోగ , ఉపాధ్యాయ , పెన్షనర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా శ్రీకాళహస్తి జె ఏ సి తాలూకా చైర్మన్ సి . చెంచురత్నం యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ఉద్యోగులకు పలు హామీలు ఇచ్చిందని అయితే కాలయాపనతో ఉద్యోగుల్లో అభద్రతా భావం ఏర్పడుతోందన్నారు.
పలుమార్లు రాష్ట్ర నాయకులు ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపినా స్పందన లేకపోవడం శోచనీయం అన్నారు . అందుకే ఉద్యమాల బాట ఎంచుకున్నామని అప్పుడైనా ప్రభుత్వంలో కదలిక వస్తుందని ఆశిస్తున్నామన్నారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు ఈ నెల చిత్తూరు లోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామని తెలిపారు .
ప్రభుత్వ పధకాలను ప్రజలకు చేరవేసే ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు . తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని ప్రభుత్వ పధకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు .
ఇప్పటి వరకు ఏడు డి ఏ లు పెండింగ్ లో ఉన్నాయని , వచ్చే జనవరి కి మరొక డి ఏ ఇవ్వాల్సి వస్తుందన్నారు . ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నిలబెట్టుకోవాలని కోరారు. పెన్షనర్లు సంఘం నాయకులు వెంకయ్య మాట్లాడుతూ పీఆర్సీ నివేదికను బహిర్గతం చేసి సంఘ నాయకులకు తెలియజేయాలన్నారు .
వైద్యశాఖ నుండి రాధారాణి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఉద్యోగులు లేకపోతే ప్రభుత్వాలు ఉండవని అన్నారు .
నిరసన కార్యక్రమంలో శ్రీకాళహస్తి జె ఏ సి తాలూకా చైర్మన్ సి . చెంచురత్నం యాదవ్ , తొట్టంబేడు తహసీల్దార్ పరమేశ్వరస్వామి, వైద్యశాఖ నుండి రాధారాణి , సురేష్ , ఉద్యోగ , ఉపాధ్యాయ , పెన్షనర్లు ఐక్య వేదిక నాయకులూ భాస్కర్ , సుబ్బారెడ్డి , శ్రీనివాసులు , సూర్యప్రకాష్ , మురళీ, చెంచయ్య , విజయకుమార్ , రవీంద్ర , హేమ , సురేష్ , నాగరాజు , ఈశ్వరబాబు , మునికుమార్ , సుబ్బరామయ్య , ప్రసాద్ , మధుసూదన్ , జయానందంలతో పాటు శ్రీకాళహస్తి , తొట్టంబేడు, ఏర్పేడు , బుచ్చినాయుడుకండ్రిగ , కెవిబి పురం మండలాల ఎన్జీవో నాయకులు పాల్గొన్నారు . .
.