ఎక్కడ చూసినా వర్షం కారణంగా నీళ్లతో నిండిపోయి గుంతలు… తెలియక పడిపోతున్నారు. వర్షం విపరీతంగా రావడంతో మధుర నగర్ మొత్తం రోడ్లన్నీ జలమయమయ్యాయి. అక్కడ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఎవ్వరూ సహాయ చర్యలు చేపట్టలేదు.
పేరు గొప్ప-ఊరు దిబ్బ అన్న చందంగా తిరుపతి నగరం తయారయింది. పేరుకే స్మార్ట్ సిటీ ఎక్కడ చూసినా గందరగోళం రోడ్లు దెబ్బతినిపోయాయి. తిరుపతి నడిబొడ్డున ఉన్న మధురానగర్ లో చినుకు పడితే చాలు… చెరువులా మారిపోతుంది. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక స్థానికులు అయోమయంలో ఉన్నారు.
వర్షం వచ్చిందంటే డ్యూటీకి వెళ్లాల్సిన ఉద్యోగులు, స్కూలుకు వెళ్లాల్సిన పిల్లలు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంటున్నారు. నడుము లోతు నీళ్ళు, డ్రైనేజీ నీళ్లతో దుర్గందం… వెరసి ఈ ప్రాంతమంతా ప్రజలు తీవ్ర ఇబ్బందులు నెలకొని ఉన్నాయి. ఆటోలు, కార్లు, స్కూటర్లు పార్కింగ్ లో వున్నావి అన్ని మునిగి పోయినాయి .
ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యంగా వుంది.ప్రభుత్వ అధికారులు ఎవరు వారి దగ్గరకు వెళ్ళలేదు. ఎటువంటి పరస్థితుల్లోనూ సి.పి.ఎం నాయకులు ప్రజలకు కావాలిసిన పాలు, కూరగాయలు వంటి నిత్యావసర సరుకులు నడుము లోతు ఉన్నటువంటి నీళ్లలో దిగి ఇంటికి ఇంటికి అందిచడం జరిగింది.
ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి సహాయ చర్యలు చేపట్టాలని సిపిఎం డిమాండ్ చేసింది ఈ కార్యక్రమంలో సి.పి.ఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు తో,డి.వై.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి ఎస్.జయచంద్ర,సి.పి.ఎం నగర కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం నాయకులు ఆర్ లక్ష్మి, బుజ్జి ,రాధా, మల్లికార్జున రావు, ఎన్.డి శీను, సుజాతమ్మ, గురు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Discussion about this post