హుజూరాబాద్ ఎన్నికలో ఘనవిజయం సాధించిన ఈటల రాజేందర్ అభిమానులు.. పాదయాత్రగా తిరుమల వెళుతున్నారు. కరీంనగర్ నుండి తిరుపతి పాదయాత్రగా విచ్చేసిన ఈటల రాజేందర్ అభిమానులకు శ్రీకాళహస్తిలో బిజెపి సీనియర్ నాయకులు గరికపాటి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా ఈటెల రాజేందర్ వ్యక్తిగత సహాయకుడు రాజిరెడ్డి ఆధ్వర్యంలో తిరుమలకు కరీంనగర్ నుండి పాదయాత్రగా బయల్దేరారు. శ్రీకాళహస్తి పట్టణానికి సోమవారం రాత్రి విచ్చేసిన వీరికి స్థానిక పాతబస్టాండ్ వద్ద ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజరాబాద్ ఇల్లంతకుంట మండలం, కరీంనగర్ జిల్లా, శ్రీ సీతారామ స్వామి వారి దేవాలయం నుండి నవంబర్ పదవ తేదీ బయలుదేరి తిరుమలకు సుమారు ఏడు వందల కిలోమీటర్లు కాలినడకన వెళుతున్నట్లు చెప్పారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించి వారి ఆశీర్వాదం కొరకు పాదయాత్ర చేస్తున్నామన్నారు.
శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం లో నిద్రించి తెల్లవారి తిరుమల కు బయలుదేరుతున్నాము అన్నారు. వీరికి శ్రీకాళహస్తి సీనియర్ నాయకులు గరికపాటి రమేష్ బాబు, పుణ్యం ఢిల్లీ కుమార్, ఇమ్మడిశెట్టి మోహన్ రావు, పట్టణ అధ్యక్షులు కాసరం రమేష్, ప్రధాన కార్యదర్శి వజ్రం కిషోర్ తదితరులు కలిసి అభినందనలు తెలిపారు.
పాదయాత్రలో రాజా రెడ్డి తో పాటు, కరుణాకర్ గౌడ్, సుభాష్ గౌడ్, నిఖిల్ రెడ్డి, ప్రవీణ్ గౌడ్, సాయి మహేందర్ గౌడ్, హేమంత్ గౌడ్, సాయి గౌడ్, ప్రవీణ్ సాగర్ యాదవ్, మహేష్ యాదవ్ పాదయాత్రలో పాల్గొన్నారు.
.