శ్రీకాళహస్తీశ్వరాలయానికి సోమవారం చెన్నైకి చెందిన సెయ్యదొరై నాజగరాజన్ అనే భక్తుడు సుమారు రూ.7.5 లక్షల విలువ చేసే వాయుదీపాలను విరాళంగా అందజేశారు.
ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు ఈ విరాళం స్వీకరించారు.
దాతకు కృతజ్ఞతలు తెలియచేసి దర్శన ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో ధనపాల్, సూపరింటెండెంట్ నాగభూషణయాదవ్, హరిబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
.